ఇవాళ రాత్రికే బీజేపీ మరో జాబితా అభ్యర్థుల విడుదల

-

ఇవాళ రాత్రి లేదా రెండు రోజుల్లో మిగతా అభ్యర్థులను ప్రకటిస్తామని బిజెపి తెలంగాణ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటికే 88 సీట్లు ప్రకటించామని తెలిపారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అవినీతిమయమని ఏ ఒక్కరు వేలెత్తి చూపలేదన్నారు. అధికారంలోకి వస్తే బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారం కోసం బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.

సీఎం కేసీఆర్ నియంతల పాలన చేస్తున్నారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ….. ‘ఉద్యమాల పేరుతో అధికారంలోకి వచ్చిన ఆయన…. నేడు ప్రజా ఆందోళనలను అణచివేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేశారు. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ సాధించుకున్నామో దానికి విరుద్ధంగా పాలన ఉంది. సీఎం, మంత్రులను సామాన్య ప్రజలు కలిసే పరిస్థితి లేదు’ అని విమర్శించారు. తెలంగాణలో వచ్చే ప్రభుత్వం బీజేపీ పార్టీదేనన్నారు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news