బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి కానుక పంపించారు. అయితే ఆ గిఫ్ట్ ఏంటో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందామా.. ప్రధాని మోదీ రిషి సునాక్ కోసం గణపతి విగ్రహంతో పాటు టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సంతకం చేసిన క్రికెట్ బ్యాట్ ను గిఫ్ట్ గా పంపించారు. ఈ కానుకను అధికారిక పర్యటన నిమిత్తం యూకేకు వెళ్లిన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రిషి సునాక్ కు అందించారు.
తన భార్య క్యోకోతో కలిసి 10 డౌనింగ్ స్ట్రీట్కు చేరుకున్న జై శంకర్.. రిషి సునాక్, అక్షత మూర్తి దంపతులకు ప్రధాని మోదీ తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మోదీ పంపిన గణపతి విగ్రహం, భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్ను రిషి సునాక్కు అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను యూకే ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది. జై శంకర్, సునాక్ కలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
The Prime Minister @RishiSunak welcomed @DrSJaishankar to Downing Street this evening.
Together they expressed their very best wishes as Indian communities around the world begin #Diwali celebrations.
🇬🇧🇮🇳 pic.twitter.com/gjCxQ0vr8d
— UK Prime Minister (@10DowningStreet) November 12, 2023