BRS అభ్యర్థులకు సీఎం కేసీఆర్ ఫోన్ !

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎక్కువ స్థాయిలో ఓటర్లను కలిసేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి పార్టీలు. ఇక సీఎం కేసీఆర్ మాత్రం రోజుకు మూడు నుంచి నాలుగు సభలలో పాల్గొంటూ… దుమ్ము లేపుతున్నారు.

అయితే తాజాగా ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్న సీఎం కేసీఆర్… ఖాళీ సమయంలో మాత్రం అభ్యర్థులకు ఫోన్ చేసి తాజా పరిస్థితిలపై ఆరా తీస్తున్నారు. పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులను అప్రమత్తం చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఏ అంశాల్లో మెరుగుపడాలో వారికి సూచిస్తున్నట్లు సమాచారం. కిందిస్థాయి నేతలతో సమన్వయంతో ముందుకు సాగాలని దిశా నిర్దేశo చేస్తున్నారు సీఎం కేసీఆర్. సానుకూల మరియు ప్రతికూల అంశాలు తెలియజేస్తూ మెరుగుపడాలని సూచనలు చేస్తున్నారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news