సీఎం కేసీఆర్ పై డీ.కే.శివకుమార్ ఫైర్.. అందుకోసమేనా ?

-

తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరుగనున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎవ్వరికీ వారు ప్రచారాన్ని చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రేవత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీ.కే.శివకుమార్ ల గురించి ప్రతీ సభలో ప్రసంగిస్తున్నారు. దీంతో తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. కర్ణాటకలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.


కేసీఆర్ అబద్దాల కోరు అన్నారు. కర్ణాటకకు రావాలని వచ్చి చూస్తే అక్కడ అభివృద్ధి ఎలా ఉందో చూడొచ్చు అన్నారు. తాము వస్తామంటే విమానం, లేదా బస్సు ఏర్పాటు చేయడానికి రెడీ అన్నారు. తొలి కేబినెట్ లోనే 6 గ్యారంటీలకు ఆమోదముద్ర వేశామన్నారు. కేసీఆర్ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పనిచేశారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయన్నారు. సీఎం ఎంపిక పార్టీ నిర్ణయిస్తుందన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ వస్తే సీఎంలను మారుస్తుందన్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ నమ్ముతున్నందుకు థాంక్స్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news