Telangana : నేడు తెలంగాణ కొత్త MLAల ప్రమాణ స్వీకారం

-

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెమ్ స్పీకర్ గా వారితో ప్రమాణం చేయిస్తారు. తొలుత సీఎం, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. తిరిగి ఈనెల 13 లేదా 14న ప్రారంభమవుతుంది. కాగా, సిఎస్ శాంతి కుమారి, డిజిపి రవి గుప్తా అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తిచేశారు.

Telangana new MLAs will be sworn in today

కాగా, అక్బరుద్దీన్‌ ఆరుసార్లు శాసనసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే సాధారణంగా ఎక్కువ సార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకుంటారన్న విషయం తెలిసిందే. అలా చూసుకుంటే ప్రస్తుతం అత్యధికంగా ఎనిమిది సార్లు ఎన్నికైన శాసన సభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్​కు చెందిన నేతలు కూడా ఉన్నారు. అయినా తాజాగా అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్​గా ఎన్నిక చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news