రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ

-

రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో సస్పెన్షన్‌కు బీజేపీ తెరదించింది. సీఎంగా భజన్‌లాల్ శర్మ పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. దీంతో ఇటీవల ఎన్నికల్లో కాషాయ పార్టీ విజయం సాధించిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కొత్త వ్యక్తులనే ముఖ్యమంత్రులుగా నియమించినట్టయ్యింది. జైపూర్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించారు. బీజేపీ కేంద్ర పరిశీలకులు రాజ్‌నాథ్ సింగ్, వినోద్ తవ్డే, సంజయ్ పాండే, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, సీపీ జోషి, మాజీ సీఎం వసుంధర రాజే సింధియా తదితర నాయకులు జైపూర్‌లో జరిగిన బీజేఎల్పీ సమావేశానికి హాజరయ్యారు.

ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న భజన్‌లాల్ శర్మ.. జైపూర్‌లోని సంగనేర్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర జీ భరద్వాజ్‌పై 48 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అలాగే, నాలుగు పర్యాయాలు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. భరత్‌పూర్‌ నుంచి శర్మ తొలుత టిక్కెట్ ఆశించారు. అయితే, సామాజిక సమీకరణాల నేపథ్యంలో దీనికి బదులు సంగనేరు టిక్కెట్ కేటాయించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు సీఎంగా అవకాశం లభించింది. బీజేఎల్పీలో సీఎంగా భజన్‌లాల్ శర్మ పేరును వసుంధర రాజే సింధియా ప్రతిపాదించగా.. మిగతా వాళ్లు ఏకగ్రీవంగా ఆమోదించారు.

Read more RELATED
Recommended to you

Latest news