ములుగు సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయానికి రాష్ట్రపతి ఆమోదముద్ర

-

ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రం తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇటీవలే ఈ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీకి చట్టబద్ధత లభించింది.

కేంద్ర విశ్వవిద్యాలయాల చట్టం-2009లో తెలంగాణలోని ములుగులో ఏర్పాటు చేస్తున్న సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం పేరును చేరుస్తూ విద్యాశాఖ ప్రవేశపెట్టిన సవరణ బిల్లును ఈనెల7వ తేదీన లోక్‌సభ, 13వ తేదీన రాజ్యసభ ఆమోదించాయి. దాంతో ఆ బిల్లుకు సోమవారం రోజున రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు అది చట్టరూపం దాల్చింది. ఈ మేరకు న్యాయశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం-2014లో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఏడేళ్లలో రెండు దశల్లో రూ.889.07 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మొత్తాన్ని కేంద్ర విద్యాశాఖ బడ్జెట్‌ రూపంలో అందించనున్నట్లు ఇటీవలే కేంద్రం తెలిపిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news