నేడు శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ రద్దు

-

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఈ రోజు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడ సేవను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడసేవ నిర్వహిస్తారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో అధ్యాయనోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడసేవ ఉండదని టీటీడీ తెలిపింది. భక్తులు గమనించాలని కోరింది.

Purnami Garuda vehicle service canceled in Srivari temple today

ఇది ఇలా ఉండగా, తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఆదివారం ఒక్క రోజే రూ. 5.05 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆరోజు 63,519 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈనెల 23 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కాగా, జనవరి 1 వరకు కొనసాగనున్నాయి. దీంతో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news