కాళేశ్వరం కట్టి..2 లక్షల కోట్లు నీటి పాలు చేశారు – కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

-

కాళేశ్వరం కట్టి..2 లక్షల కోట్లు నీటి పాలు చేశారని ఫైర్‌ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. 2023 మర్చిపోలేని సంవత్సరం.. నియంత పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. కాంగ్రెస్ గెలుపుకోసం పని చేసిన కార్యకర్తలకు చేతులెత్తి మొక్కుతున్నాను…కేసీఆర్ వందల కోట్లు అవినీతి సొమ్ము కూడగట్టుకున్నాడని ఆరోపణలు చేశారు.

komatireddy comments on kcr family

కాళేశ్వరం నాణ్యత లేకుందా కట్టి..2 లక్షల కోట్లు నీటి పాలు చేశారని.. కేసీఆర్.. కొడుకు..బిడ్డ అల్లుడు చేతిలోనే అధికారం ఉండేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం గా..మేము అంతా టీం స్పిరిట్ తో పని చేస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని.. కానీ ప్రజలు కాస్త ఓపిక పట్టాలని కోరారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news