సీఎం జగన్‌ పై రఘురామ పిటీషన్‌ !

-

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఎలా లబ్ధి పొందారో స్పష్టంగా ఆధారాలతో సహా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని రఘురామకృష్ణ రాజు తెలిపారు. తాను దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత పొందుతుందనే ఆశాభావంతో ఉన్నానని, సాక్షి దినపత్రికకు వందల కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ లు ఇచ్చారని, జగనన్న ఆసరా అడ్వర్టైజ్మెంట్ ను మంగళవారం కూడా రెండు మూడు పేజీలు సాక్షి దినపత్రికకు మాత్రమే ఇవ్వడం జరిగిందని తెలిపారు.

ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలకు ఈ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదని, ఒక్క సాక్షి దినపత్రికకే అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. సాక్షి దినపత్రిక తనది కాదని జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పవచ్చు కానీ దానిపై ఇంకా సాక్షి దినపత్రిక కౌంటర్ దాఖలు చేయలేదని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. తాను దాఖలు చేసిన పిటిషన్ యొక్క విచారణ అర్హతపై మంగళవారం నాడు ధర్మాసనం విచారణ చేపట్టిందని, గతంలో ప్రతివాదులకు కౌంటర్ దాఖలు చేయడానికి ధర్మాసనం ఒక టైం ఫ్రేమ్ ను ఇచ్చిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news