పేద బిడ్డ.. చెప్పులు కుట్టే బిడ్డను.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను చేసింది : రేవంత్ రెడ్డి

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో మరోసారి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ పేరును పదే పదే ప్రస్తావించారు. అంతేకాదు.. వేలాది మంది హాజరైన సభలో స్టేజీ పైకి ఆహ్వానించారు. ఒక పేదోళ్ల బిడ్డ.. చెప్పులు కుట్టుకునే బిడ్డ.. మాదిగ బిడ్డ అంటూ సంబోధిస్తూ మందుల సామెల్ చేతిలో రూ.50వేలు లేకున్నప్పటికీ 52వేలతో కాంగ్రెస్ పార్టీ గెలిపించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడైన సామెల్ ను ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గుర్తించి బీఫామ్ ఇచ్చారని స్పష్టం చేశారు.

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ భూ స్వామి కాదు.. దోపిడి దారుడు కాదు.. మీలాగా దొరలాగా దోచుకున్నారా..? అంటూ ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే.. మందుల సామెల్ తో పాటు మరికొందరూ ఎమ్మెల్యేలు అయ్యారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవలే శాసన సభలో కూడా మందుల సామెల్ ను సూచిస్తూ బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా మాట్లాడిన విషయం విధితమే.

Read more RELATED
Recommended to you

Latest news