ఎట్టేకలకు ఓటిటీలోకి ది కేరళ స్టోరీ సినిమా

-

సాధారణంగా థియేటర్లలో విడుదల అయిన సినిమాలు నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తాయి. అయితే కొన్ని చిత్రాలు నెలల తరబడినా ఓటీటీలోకి రావడం లేదు. అందులో అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ సినిమా ఒకటి. డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.మే 5న విడుదలైన ఈ కాంట్రవర్సీ సినిమా లాంగ్‌ రన్‌లో ఏకంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం బడ్జెట్‌ కేవలం రూ. 35 కోట్లే . కేరళలో వివాదాస్పదమైన లవ్‌ జిహాద్‌ నేపథ్యంలో తెరకెక్కిన ది కేరళ స్టోరీ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. పశ్చిమ బెంగాల్‌ , తమిళనాడు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించుకుండా నిషేధం విధించారు.

 

ఇక ఎట్టకేలకు ఈ చిత్రం ఓటిటీ డేట్ ఖరారు అయ్యింది. ప్రముఖ ఓటిటీ సంస్థ జీ5.. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 16 నుంచి అన్ని భాషల్లో ది కేరళ స్టోరీ స్ట్రీమింగ్ కాబోతుంది. మరి ఈ చిత్రం ఓటిటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.ఈ సినిమాలో యోగితా బిహానీ, సోనియా బలానీ,సిద్ధి ఇద్నాని తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news