విరాట్ కోహ్లి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం: జైషా

-

ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కి టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో దూరమైన సంగతి తెలిసిందే.టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. అతడికి ఎప్పుడూ మద్దతుగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. కాగా ఇంగ్లండ్తో జరిగే టెస్ట్ సిరీస్లో తనకు సెలవు కల్పించాలని కోహ్లి బీసీసీఐని అభ్యర్థించారు. దీంతో బీసీసీఐ కూడా వెంటనే అతడికి సెలవులు ఇచ్చింది.

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇంగ్లాండ్ తో జరిగే మిగతా టెస్టులకూ దూరమైనట్లు తెలుస్తోంది. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టులలో ఇరుజట్లు చెరొక విజయం సాధించడంతో సిరీస్ 1-1 తో సమం అయింది.ఇక మూడో టెస్ట్ భారత్ ,ఇంగ్లాండ్ మధ్య ఈనెల 15 నుంచి రాజ్‌కోట్‌ వేదికగా జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news