‘ఏం పీకలేవు’ అని విహారిపై సంచలన వ్యాఖ్యలు చేసిన యువ క్రికెటర్

-

ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఉండలేనంటూ భవిష్యత్తులో ఆంధ్రా క్రికెట్ జట్టుకు ఆడబోనని సీనియర్ క్రికెటర్ హనుమ విహారి సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే.మధ్యప్రదేశ్ తో క్వార్టర్ ఫైనల్ లో 4పరుగుల తేడాతో ఆంధ్రా జట్టు ఓడిన తర్వాత విహారి ఈ మేరకు పోస్టు చేశాడు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఓ రాజకీయ నాయకుడి కుమారుడి కోసం తనను కెప్టెన్సీ నుంచి తప్పించినా జట్టు, ఆట పట్ల ప్రేమతో రంజీ సీజన్ ముగిసేవరకు కొనసాగినట్టు పేర్కొన్నారు.

విహారి పోస్టు వైరల్‌ అయిన తర్వాత పృథ్వీరాజ్‌ ఇన్‌స్టా వేదికగా స్పందిస్తూ.. ‘అందరికీ హలో.. మీరు కామెంట్‌ బాక్స్‌లలో వెతుకుతున్న క్రికెటర్ నేనే. అతడు చెప్పింది అబద్ధం. నాపై అసభ్య పదజాలం సరికాదు అని అన్నాడు. నువ్వు ఇంతకు మించి ఏం పీకలేవు మిస్టర్ సో కాల్డ్ ఛాంపియన్’ అని ఇన్స్టాలో స్టోరీ పెట్టారు.ఈ సింపతీ గేమ్స్‌ ఎన్ని కావాలనుకుంటే అన్ని ఆడుకో అని అతను స్టేటస్‌లో రాసుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news