వెబ్‌ సిరీస్‌గా భారతరత్న పీవీ నరసింహరావు బయోపిక్‌

-

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ అంతా పేట్రియాటిక్ సినిమాలు, బయోపిక్ లదే. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ, సినీ, క్రీడాకారులు, శాస్త్రవేత్తల బయోపిక్ లు తెరకెక్కి ప్రేక్షకులు నీరాజనాలు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో రాజకీయ నేత బయోపిక్ తెరపైకి రానుంది. ఆహా ఓటీటీ వేదికగా భారతరత్న, బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జీవిత చరిత్ర వెబ్‌ సిరీస్‌గా రానుంది.

ఈ విషయాన్ని గతంలోనే ఆహా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయనకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఈ సిరీస్‌పై పోస్ట్‌ పెట్టింది. ఈ బయోపిక్‌ను రూపొందించడం ఎంతో గర్వంగా, ఉత్సాహంగా ఉందని తెలిపింది. వినయ్‌ సీతాపతి రాసిన ‘ది హాఫ్‌ లయన్‌’ పుస్తకం ఆధారంగా అదే పేరుతో బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ప్రకాశ్‌ ఝా ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. ఆహా స్టూడియో, అప్లాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను ఆహా తాజాగా పంచుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news