వైఎస్‌ వివేకా కేసు హంతకుడు ఎవరో ప్రజలకు చెప్పండి !

-

ఇంకా డిప్లమాసి అవసరం లేదని మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి హంతకులు ఎవరో ప్రజలకు తేల్చి చెప్పాలని డాక్టర్ వై.యస్. సునీతా రెడ్డిని రఘురామకృష్ణ రాజు కోరారు. హంతకులు పరిపాలకులుగా ఉండడానికి వీలులేదని పేర్లు చెప్పకుండానే వై.యస్ వివేకానంద రెడ్డి హంతకులు ఎవరో డాక్టర్ సునీతా రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారన్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని విచారించాలని ఆమె కోరిన విషయాన్ని ఈ సందర్భంగా రఘురామకృష్ణ రాజు గారు గుర్తు చేశారు.

డాక్టర్ సునీతా రెడ్డి గారు చేసిన ప్రకటనతో వివేకా గారి హత్యలో జగన్ మోహన్ రెడ్డి గారికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లుగా పరోక్షంగా చెప్పారని అన్నారు. డాక్టర్ సునీతా రెడ్డి గారి వ్యాఖ్యలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు రివర్స్ టెండరింగ్ మాదిరిగా రివర్స్ లో సునీతా రెడ్డి గారిపై కేసు నమోదు చేసి విచారించాలనడం విడ్డూరంగా ఉందని అన్నారు.

వివేకానంద రెడ్డి గారిని ఎవరు ఎందుకోసం చంపారో ప్రజలందరికీ తెలుసునని, ఎవరు వివేకానంద రెడ్డి గారిని చంపారో సీబీఐ చెప్పిందని, కాకపోతే తమ పలుకుబడితో వారికి శిక్ష పడకుండా, కొంతమంది అడ్డుకుంటున్నారని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు సహాయం చేశారని డాక్టర్ సునీతా రెడ్డి గారు చెప్పారని, అందులో తప్పేముంది… ఒకరికి అన్యాయం జరిగినప్పుడు మాట సహాయం చేయడం మానవుడిగా మన ధర్మం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news