సింహం సింగిల్‌గా వస్తుంది: మంత్రి పెద్దిరెడ్డి

-

కోడి గుంట వద్ద జగనన్న కాలనీ ని మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు. ఇక వివరాలు చూస్తే.. సంత పేట లో చిల్డ్రన్స్ పార్క్ భూమి పూజ చేసారు మంత్రి. ఆ తరవాత మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లో అన్ని పార్టీలు ఒక్కటైనా జగన్ సింగిల్ గానే ఎదుర్కొంటాడు సింహం సింగిల్‌గా వస్తుంది అని అన్నారు.

అలానే మంత్రి పెద్ది రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు లో విజయా నంద రెడ్డి సింగిల్‌గా పోటీ చేసి గెలుస్తారు అన్నారు. TDPలో ఎంత మంది చేరినా YCPదే విజయం అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. చిత్తూరు ఎంపి స్దానం లో రెడ్డప్ప, ఎమ్మెల్యే గా విజయా నంద రెడ్డి ల గెలుపు ఖాయం అని మంత్రి పెద్ది రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news