ప్రతి మంగళవారం, శుక్రవారమే రైతు నేస్తం కార్యక్రమం !

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతు వేదిక లకు వీడియో కాన్ఫరెన్స్‌ అను సంధానం ద్వారా రైతుల సమస్యల ను పరిష్కరించే వినూత్న కార్యక్రమమే ఈ రైతు నేస్తం. దశలవారీగా 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల స్థాపన. రూ.97 కోట్ల తో ప్రాజెక్టు అమలు చేస్తున్నారు.

Telangana Rythu Nestham

ఈ మేరకు మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు. రూ. 4.07 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్‌ ఫ్లాట్‌ ఫారం కానుంది రైతు నేస్తం. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చలు జరుపుకోవచ్చును. గ్రామాల నుంచే రైతులు ఆన్ లైన్లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవటం. తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవటం జరుగుతుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news