రైతులకు గుడ్ న్యూస్.. ధరణీ దరఖాస్తుల పరిశీలన గడువు పొడగింపు..!

-

ధరణి దరఖాస్తుల పరిశీలన గడువును తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిస్తూ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి పెండింగ్ దరఖాస్తులకు సంబంధించిన స్పెషల్ డ్రైవ్ ఈ నెల 1 నుంచి 9 వరకు నిర్వహించి పరిష్కారించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ డ్రైవ్ లో ఇప్పటి వరకు 1.06 లక్షల దరఖాస్తులకు పైగా రెవెన్యూ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి, డెస్వర్ సిద్ధం చేసినట్లు సమాచారం. పెండింగ్ దరఖాస్తుల పరిశీలనకు తహసిల్దార్ కార్యాలయం సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా నియమించారు.

ఈ బృందాలు ప్రస్తుతం ధరణి పెండింగ్ దరఖాస్తులకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తూ, ఫీల్డ్ లో కూడా దరఖాస్తుదారుడే ఉన్నాడా.. లేదా? అన్నది నిర్ధారించుకునేందుకు క్షేత్ర స్థాయి సర్వే చేపట్టాయి. ధరణి పోర్టల్లో ఆర్డీవోలు, తహసీల్దారులకు లాగిన్ ఆదేశాలు రాగానే పెండింగ్ దరఖాస్తులు అన్లైన్ వర్క్ త్వరలో ప్రారంభం అవుతుందని రెవెన్యూ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో మరోసారి ప్రభుత్వం పరిశీలన గడువును పెంచడం బాధితులకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news