ఐపీఎల్ కోసం 50 ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేయనున్న బీసీసీఐ

-

ఐపీఎల్ ఎప్పుడేప్పుడు స్టార్ట్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది .ఈనెల 22న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో క్రికెట్ లవర్స్ కి బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది.ఐపీఎల్ సీజన్-17 కోసం దేశ వ్యాప్తంగా 50 ఫ్యాన్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. మొదటి ఫ్యాన్ పార్క్ను ఈ నెల 22న మధురైలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మొదటి రెండు వారాలకు దేశంలోని 11 రాష్ట్రాలను ఫ్యాన్ పార్కులకు వేదికలుగా ఎంపిక చేయగా ఆ జాబితాలో తెలంగాణ ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ లేదు. మార్చి 30, 31 తేదీల్లో నిజామాబాద్లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

ఇదిలా ఉంటే… ఇప్పటికే ఆయా జట్లు ప్రాక్టీస్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇండియా ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news