ఏపీ బీజేపీలో ముసలం.. పురంధేశ్వరి, సోమువీర్రాజు మధ్య వివాధాలు ?

-

ఏపీ బీజేపీలో ముసలం చోటు చేసుకుంది. పురంధేశ్వరి, సోమువీర్రాజు మధ్య వివాధాలు తెరపైకి వచ్చినట్లు సమాచారం అందుతోంది. పార్లమెంట్‌, ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీలో అయోమయం నెలకొందట. ఇంకా అభ్యర్ధుల ఎంపిక కొలిక్కిరాలేదు. పెద్దలతో చర్చల కోసం ఢిల్లీకి పయనం అయ్యారు పురంధేశ్వరి, సోము, మధుకర్.

Disputes between Purandheswari and Somuveerraju

సీట్లు దక్కని సీనియర్లు బిజేపీ కేంద్ర అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. రాజమండ్రి ఎంపీ సీటు తనకే కావాలంటున్నారు సోమువీర్రాజు. సోము వీర్రాజుకు సీటివ్వాలని అమిత్ షా పేర్కొన్నారట. కానీ అసెంబ్లీకి  పోటీచేయనంటున్నారట సోము వీర్రాజు. ఇక ఇప్పటికే  రాజమండ్రి ఎంపీ సీటును కోరుకుంటున్నారట పురంధేశ్వరి. దీంతో పురంధేశ్వరి, సోమువీర్రాజు మధ్య వివాధాలు తెరపైకి వచ్చినట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news