ఏడాది వయస్సున్న కొడుకుకు విషమిచ్చి తానూ విషం తాగిన తల్లి

-

ఏడాది వయస్సున్న కొడుకుకు విషమిచ్చి తానూ విషం తాగింది తల్లి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ బొమ్మకల్‌లో కుటుంబ కలహాలతో ఏడాది వయస్సున్న కొడుకుకు విషమిచ్చి తానూ కూడా విషం తాగింది తల్లి శ్రీజ. ఈ సంఘటనలో ఇద్దరూ మృతి చెందారు.

ఏడాది వయస్సున్న కొడుకుకు విషమిచ్చి తానూ విషం తాగిన తల్లి

కూతురు మృతి తట్టుకోలేక శ్రీజ తల్లి జయప్రద కూడా విషం తాగడంతో చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి కరీంనగర్ కు తరలించగా అప్పటికే బాబు చనిపోగా,శ్రీజ ను మెరుగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లినా రు.చికిత్స పొందుతూ శ్రీజ అపోలో ఆస్పత్రిలో 10:00 గంటల సమయములో చనిపోయింది. కరీంనగర్ రూరల్ పోలీస్ వారు సంఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news