IPL 2024 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్

-

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 22 మ్యాచ్లు ఈ టోర్నమెంట్లో పూర్తయ్యాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా లో ఇవాళ పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చండీగఢ్ వేదికగా రాత్రి 7:30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ 2 మ్యాచ్ లు గెలిచింది. పంజాబ్ కింగ్స్ కూడా 4 మ్యాచ్ లు ఆడి 2 మ్యాచ్ లు గెలిచింది .

సన్ రైజర్స్ హైదరాబాద్  ప్లేయింగ్ ఎలెవన్ : అభిషేక్, హెడ్, మార్క్రమ్, షాబాజ్, క్లాసెన్, నితీశ్, సమద్, కమిన్స్, భువనేశ్వర్, మయాంక్ మార్కండే, ఉనాద్కత్

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్   : శిఖర్, బెయిర్స్టా, జితేశ్, సామ్ కరన్, శశాంక్, సికందర్, అశుతోశ్, హరీత్ బ్రార్, హర్షల్ పటేల్, రబాడ, అర్షదీప్ సింగ్

Read more RELATED
Recommended to you

Latest news