రైల్వే శాఖ కీలక నిర్ణయం.. వేసవి రద్దీ దృష్ట్యా 9,111 అదనపు ట్రిప్పులు

-

వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్‌లలో రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు తెలిపింది.

‘గత ఏడాది వేసవిలో మొత్తం 6,369 అదనపు ట్రిప్పులు నడిపామని ఈసారి ఆ సంఖ్యను 9111కు పెంచామని రైల్వే శాఖ తెలిపింది. అత్యధికంగా పశ్చిమ రైల్వే నుంచి 1878 ట్రిప్పులు ఉండగా.. వాయువ్య రైల్వే (1623), దక్షిణ మధ్య రైల్వే (1012), తూర్పు మధ్య రైల్వే (1003) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మీడియా కథనాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, రైల్వే ఇంటిగ్రేటెడ్ హెల్ప్‌లైన్ నంబర్ ‘139’, ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌ వంటి వేదికల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా డిమాండ్‌ను అంచనా వేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని రైళ్లు, ట్రిప్పులను పెంచుతామని వెల్లడించింది. ప్రయాణికుల భద్రత, తాగునీటి లభ్యత, రద్దీ నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను రైల్వే శాఖ ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news