జెట్ స్పీడ్ లో అయోధ్య రామమందిర నిర్మాణం.. డిసెంబర్ కల్లా పూర్తి

-

ఉత్తర్​ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరం నిర్మాణ పనులు జెట్ స్పీడులో సాగుతున్నాయి. ఆలయ నిర్మాణం పనులు  ఈ ఏడాది చివరికల్లా పూర్తి కానున్నాయని అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. డిసెంబరులోగా రామమందిరం పూర్తిస్థాయిలో సిద్ధం అవుతుందని చెప్పారు.

కీలకమైన ఆలయ శిఖరంతో పాటు మొదటి, రెండో, మూడో అంతస్తుల పనులను వచ్చే ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మిశ్రా చెప్పారు. గర్భగుడిలో రామ్ దర్బార్‌ను ఏర్పాటు చేయనున్నామని, దీనికి సంబంధించిన పనులను ఇప్పటికే రామజన్మభూమి కాంప్లెక్స్‌లో ప్రారంభించినట్లు తెలిపారు ఈ పనుల్లో వేగాన్ని పెంచేందుకు గాను ఎల్ అండ్ టీ, టాటా, ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వ నిర్మాణ సంస్థ తమ ఉద్యోగుల సంఖ్యను పెంచనున్నాయి, డిసెంబరు నాటికి ఆలయ పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు. రామ మందిర నిర్మాణ సమయంలో కింద అంతస్తులో ఏర్పాటు చేసిన స్తంభాల్లో విగ్రహాలను చెక్కేందుకు 200 మంది కళాకారులను.. మిగతా మూడు అంతస్తుల్లో పనులు చేసేందుకు దాదాపు 1200 మంది కార్మికులను నియమించారు.

Read more RELATED
Recommended to you

Latest news