IPL 2024 : ఐపీఎల్లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా రాజస్థాన్ ఆటగాడు

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా మరో ఆసక్తికరమైన మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. ఐపీఎల్లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్గా యుజ్వేంద్ర చాహల్ రికార్డు సృష్టించారు. ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచులో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 153 మ్యాచులు ఆడిన చాహల్ గతంలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం రాజస్థాన్ రాయలు తరుపున ఆడుతున్నారు.

కాగా, ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ లో ఓపెనర్స్ హిట్ మ్యాన్, ఇషాన్ కిషన్ దారుణంగా విఫలమయ్యారు. రోహిత్ శర్మ 6 పరుగులు చేయగా ,ఇషాన్ కిసాన్ డక్ అవుట్ అయ్యాడు.ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ కూడా పది పరుగులు మాత్రమే చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ (10) విఫలమయ్యా రు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు తిలక్ వర్మ(65), వధేరా(49) రాణించడంతో ముంబై గౌరవప్రదమైన స్కోర్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news