IPL 2024 : ఆదుకున్న తిలక్ వర్మ, వదేరా… రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే ?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా మరో ఆసక్తికరమైన మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.

మొదటగా బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ లో ఓపెనర్స్ హిట్ మ్యాన్, ఇషాన్ కిషన్ దారుణంగా విఫలమయ్యారు. రోహిత్ శర్మ 6 పరుగులు చేయగా ,ఇషాన్ కిసాన్ డక్ అవుట్ అయ్యాడు.ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ కూడా పది పరుగులు మాత్రమే చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ (10) విఫలమయ్యా రు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు తిలక్ వర్మ(65), వధేరా(49) రాణించడంతో ముంబై గౌరవప్రదమైన స్కోర్ చేసింది.రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ(5), బౌల్ట్(2) ముంబైని దెబ్బకొట్టారు.

 

Read more RELATED
Recommended to you

Latest news