మద్యం ప్రియులకు షాక్.. ఇవాళ వైన్ షాప్స్ బంద్

-

మద్యం ప్రియులకు షాక్. హైదరాబాద్ పోలీసులు మందుబాబులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈరోజు నగర వ్యాప్తంగా వైన్ షాప్స్ బంద్ కానున్నాయి. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా నగర వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అధికారుల ఈ నిర్ణయంతో మందుబాబులు నిరాశ చెందారు. చుక్క పడకపోతే పొద్దు పొడవని వారంతా అయ్యో.. అని తెగ ఫీల్ అవుతున్నారు. కొందరేమో ముందుగానే స్టాక్ తెచ్చి పెట్టుకున్నారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేలాది మంది భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. అంజన్న స్వామి మాల ధారణ చేసిన దీక్షాపరులు దీక్షను విడిచేందుకు కొండగట్టుకు తరలి వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news