టీటీడీ వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!

-

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వద్ద ఉన్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్‌ అవకాశం కల్పించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7వ తేదీ నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. పలు దఫాలు గడువు పొడిగిస్తూ ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లు మార్పిడి చేసుకునే అవకాశం కల్పించింది. అయితే రెండు వేల నోట్ల రూపాయలు బ్యాన్ చేసినా తర్వాత కూడా.. కొందరు భక్తులు స్వామి వారి హుండీలో వాటిని సమర్పించారు.

దీంతో ఆ నోట్ల మార్పిడికి అవకాశం కల్పించాలని టీటీడీ ఉన్నతాధికారులు ఆర్‌బీఐని పలుమార్లు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందన రావడంతో గతేడాది అక్టోబరు 8వ తేదీ నుంచి ఈ ఏడాది మార్చి 22వ తేదీ వరకూ అయిదు విడతల్లో రూ.3.20 కోట్ల విలువైన నోట్లు మార్చినట్లు సంబంధిత వర్గాల సమాచారం. 2016లో జరిగిన నోట్ల రద్దు సమయంలో టీటీడీ వద్ద పోగైన సుమారు రూ.50 కోట్లను రిజర్వు బ్యాంకు తీసుకోలేదు.

Read more RELATED
Recommended to you

Latest news