IPL 2024 : సంచలనం సృష్టించిన పంజాబ్ కింగ్స్…8 వికెట్ల తేడాతో ఘన విజయం

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పెను సంచలనం సృష్టించింది. ఆ జట్టు ఏకంగా 262 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జానీ బెయిర్స్టా (108*) సెంచరీతో విధ్వంసం సృష్టించారు. ప్రభ్సమ్రాన్ సింగ్ (54) అర్ధశతకంతో పాటు చివర్లో శశాంక్ సింగ్ (68*) మెరుపులు మెరిపించారు. సునీల్ నరైన్ ఒక వికెట్ తీశారు.

ఇక తొలుత బ్యాటింగ్ దిగిన కోల్కత్తా నైట్ రైడర్స్ ఓపెనర్స్ విధ్వంసం సృష్టించారు.కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. తొలి వికెట్ కి సునీల్ నరేన్ ,సాల్ట్ 10.2 ఓవర్లలో 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.సునీల్ నరేన్ 32 బంతుల్లో 4 సిక్సర్లతో 71 పరుగులు చేయగా,సాల్ట్ 37 బంతుల్లో 6 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు.తర్వాత వచ్చిన వెంకటేశ్ అయ్యర్ 23 బంతుల్లో 39 పరుగులు, శ్రేయస్ 10 బంతుల్లో 28 పరుగులు , రస్సెల్ 12 బంతుల్లో 24 పరుగులతో రాణించారు.పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్ దీప్ 2 వికెట్లు తీయగా, హర్షల్, కరన్, చాహర్ తలో వికెట్ తీశారు. మరి ఈ భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ చేధిస్తుందో లేదో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news