చంద్రబాబు , పవన్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ

-

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలకు 10 రోజులు మాత్రమే సమయం ఉన్న క్రమంలో నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో అడపాదడపా అనుచిత వ్యాఖ్యలు చేసి ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను చంద్రబాబు, పవన్ తో పాటు మీడియా సంస్థలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది.

ఇటీవల జరిగిన పలు బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు మల్లాది విష్ణు.ఈసీకి ఫిర్యాదు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, స్వార్ధ ప్రయోజనాల కోసమే చంద్రబాబు, పవన్ లు ముఖ్యమంత్రి జగన్ పై చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.ఓటమి భయంతోనే బాబు, పవన్ లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news