నిరుద్యోగులు, ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్

-

నిరుద్యోగులు, ఉద్యోగులకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గుడ్ న్యూస్ ప్రకటించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లు, టీచర్లకు ఆయన లేఖ రాశారు.తాము అధికారంలోకి వస్తే డీఎస్సీపైనే తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అందిస్తామని,సకాలంలో జీతాలు, పింఛన్లు అందజేయడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

ఖాళీ పోస్టులన్నింటిని భర్తీ చేస్తామని అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగులు, పింఛన్లర్లు, టీచర్లు సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం వేధించిందని, భయం గుప్పిట్లో నుంచి బయటకు రావాలని చంద్రబాబు తెలిపారు.5 సంవత్సరాలుగా ఉద్యోగులు పడుతున్న బాధలను తాను స్వయంగా చూశానని అన్నారు. జీతాలు రాక చాలామంది ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడ్డారని , హక్కుల కోసం ఉద్యోగులు పోరాటం చేస్తే ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడిందని చంద్ర బాబు మండిపడ్డారు.ఎప్పుడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీని తీసుకొచ్చిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news