ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు

-

ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వెంటనే ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మైనింగ్‌ జరిగే ప్రదేశానికి వెళ్లి పర్యవేక్షించాలని పేర్కొంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది.

అక్రమ మైనింగ్‌ జరుగుతున్న ప్రదేశాలను ఇప్పటికే గుర్తించినందున తవ్వకాలు నిలిపివేశారా? లేదా? అనేది తనిఖీ చేయాలని అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రభుత్వ చర్యలు అన్నీ కాగితాలపైనే ఉన్నాయని.. క్షేత్రస్థాయిలో కనిపించవని న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓఖా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అక్రమ తవ్వకాలు వెంటనే ఆపాలని.. అనుమతి ఉన్న చోట కూడా యంత్రాలను ఉపయోగించవద్దని గత నెల 29న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా తవ్వకాలు జరిగాయంటూ తేదీ, సమయం, ఇసుక రవాణా చేస్తున్న వాహనాల ఫొటోలను ఎన్జీవో నేత నాగేంద్రకుమార్‌ అత్యున్నత న్యాయస్థానం ముందుంచారు.

Read more RELATED
Recommended to you

Latest news