ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతి

-

నెల్లూరు జిల్లా కావలిలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీ కుమారుడు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగనం గ్రామానికి చెందిన బి.సుభాషిణి (55) అంగన్వాడీ ఆయాగా పని చేస్తున్నారు. అధికారులు ఆమెకు కావలిలో ఎన్నికల విధులు కేటాయించారు.

రేపు (మే 13వ తేదీ 2024) పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు, ఈ క్రమంలోనే తనకు కేటాయించిన కేంద్రానికి తన కుమారుడు విజయ్‌ (19)తో సుభాషిణి బయల్దేరారు. కావలి పట్టణంలోని రైల్వే ట్రాక్‌ దాటే క్రమంలో ఆమెను రైలు ఢీ కొట్టింది. రైలు వస్తున్న విషయాన్ని గమనించకుండా ట్రాక్‌ పైకి వెళ్లిన తల్లిని రక్షించే క్రమంలో కుమారుడూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news