యడియూరప్పపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ మృతి

-

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పపై ఇటీవల ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ మహిళ ఆదివారం రోజు రాత్రి (54) మరణించింది. ఏడాదిన్నరగా లంగ్ క్యాన్సర్తో బాధపడుతోందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. ఆదివారం రాత్రి మహిళ ఆరోగ్యం మరింత క్షీణించడం వల్ల ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందతూ మరణించారని వెల్లడించారు.

ఏం జరిగిందంటే?

బీఎస్ యడియూరప్ప తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఓ మహిళ మార్చిలో ఫిర్యాదు చేసింది. ఓ మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి ఫిబ్రవరి 2న యడియూరప్పను కలవగా.. ఆ సమయంలో తన కుమార్తెను బీజేపీ నేత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు యడియూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే తనకు ప్రాణ హాని ఉందని మహిళ పేర్కొంది. దీంతో మహిళకి పోలీసు భద్రత కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news