ఉత్కంఠకు తెర నేడే.. మరికొన్ని గంటల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు

-

యావత్ దేశం ఇప్పుడు ఏపీ వైపు చూస్తోంది. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఈవీఎంలలో దాగిన ఓటరు తీర్పు వెల్లడి కానుంది. ఏపీలో ఇవైళ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు.

పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పల్నాడు, కాకినాడ వంటి ప్రాంతాల్లో గట్టి బందోబస్తు నిర్వహించారు. పోలింగ్ రోజున జరిగినటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపు కూడా పూర్తయ్యాకే అధికారికంగా ఫలితాలు విడుదల రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా చేస్తామన్నారు.  కొవ్వూరు, నరసాపురం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మొట్టమొదట విడుదల కానున్నాయి. ఈ రెండు స్థానాల్లో 13 రౌండ్లలోనే ఫలితం తేలిపోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news