కరీంనగర్‌లో బండి సంజయ్ జోరు.. 63,985 ఓట్లతో ఆధిక్యం

-

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముమ్మరంగా సాగుతోంది. మొత్తం 17 స్థానాలకుగాను 8 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉండగా… 7 చోట్ల కాంగ్రెస్‌, ఒక స్థానంలో మజ్లిస్‌ ముందంజలో ఉన్నాయి. 120 హాళ్లలో 1,855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతోంది. చొప్పదండి, దేవరకొండ, యాకుత్‌పురాలో అత్యధికంగా 24 రౌండ్లలో కౌంటింగ్‌ జరగనుంది. ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేటలో అత్యల్పంగా 13 రౌండ్లలో కౌంటింగ్‌ జరగనుంది.

కరీంనగర్‌లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 5 రౌండ్‌ పూర్తయ్యేసరికి 63,985 ఓట్లతో బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆయనకు 1,14,779 ఓట్లు రాగా.. బీఆర్​ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ (రెండో స్థానం)​ – 52,432 ఓట్లు, కాంగ్రెస్​ అభ్యర్థి వెలిచాల రాజేందర్ – 63,009 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news