ఏపీలో కూటమి ప్రభంజనం.. ఓటమి బాటలో వైసీపీ

-

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి సునామీ సృష్టిస్తోంది. ఆధిక్యాల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ (88)ను దాటేసి ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు 120కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ కేవలం 15 చోట్ల మాత్రమే లీడ్‌లో ఉంది. తొలి రౌండ్‌ నుంచే కూటమి అభ్యర్థులు పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని చూపించారు.

ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో సత్తా చాటారు. వైసీపీకి పట్టు ఉన్నట్లుగా భావించే రాయలసీమ జిల్లాల్లోనూ కూటమికే లీడ్‌ రావడం గమనార్హం. హలో ఏపీ.. బైబై వైసీపీ అంటూ ఏపీ ఓటరు తీర్పునిచ్చారు. కౌంటింగ్‌ కేంద్రాల నుంచి వైసీపీ అభ్యర్థులు వెనుదిరుగుతున్నారు. చంద్రబాబు, పవన్‌, బాలకృష్ణ, లోకేష్‌ విజయం దిశగా సాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news