ఎన్డీఏ పక్షనేతగా నరేంద్ర మోడీ ఏకగ్రీవం

-

ఎన్డీఏ పక్షనేతగా నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.టీడీపీ అధినేత చంద్రబాబు బలపరచగా.. కూటమి పక్ష నేతలంతా ఏకగ్రీవంగా మోడీని ఎంచుకున్నారు.

మంగళవారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఇక ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధాని కాబోతున్నారు. జూన్ 8న ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.ఎన్డీఏ కూటమిలో ఆంధ్ర ప్రదేశ్ నుంచి బీహార్‌లోని జేడీయూ అధినేత, సీఎం నితీష్‌కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ మార్కు దాటలేకపోయింది. దీంతో ఎన్డీఏ పక్షాలే బీజేపీకి కీలకం కానున్నాయి. ఇక సమావేశానికి ఎన్డీఏ పక్షనేతలంతా హాజరై.. నరేంద్ర మోడీని ఎన్డీఏ పక్షనేతగా ఎన్నుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news