ఇవాళ ఉదయం ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ రావు అంత్యక్రియలు

-

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు (88) కన్నుమూశారు. ఈ నెల 5న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ ‘స్టార్‌’ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. అనంతరం పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు రామోజీ ఫిల్మ్‌సిటీకి తరలించారు. ప్రజల సందర్శన కోసం రామోజీ గ్రూపు కార్పొరేట్‌ ఆఫీస్‌లో ఉంచగా అక్కడికి చేరుకున్న సామాన్య ప్రజలు, అతిరథమహారథులు, ప్రముఖులు రామోజీకి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. రాజకీయ, సినీ ప్రముఖులంతా రామోజీకి ఘన నివాళులు అర్పించారు. ఇక ఇవాళ (జూన్ 9వ తేదీ ఆదివారం) ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య అంత్యక్రియలు నిర్వహించేందుకు ఫిల్మ్‌ సిటీలోని స్మృతివనంలో ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news