నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

-

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబుకుప ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం బాబును మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. చంద్రబాబు అనంతరం మంత్రులతో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, జేపీ నడ్డా, నితిన్‌ గడ్కరీ, రామ్మోహన్‌నాయుడు, చిరాగ్‌ పాసవాన్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు జాతీయ నాయకులు హాజరయ్యారు. సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్‌ దంపతులు, రామ్‌చరణ్‌ తదితరులు వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news