కరెంట్ బిల్లులను ఒకేసారి క్లియర్ చేసిన హెచ్‌సీఏ

-

గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం కరెంట్ బిల్లు ఎట్టకేలకు క్లియర్ అయ్యింది. దాదాపు కోటి 64 లక్షల కరెంట్ బిల్లును హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఇవాళ చెల్లించింది.టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్‌కు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు కోటి 64 లక్షల చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రావు సీఎండీ ముషారఫ్‌కు ఐపీఎల్ సమయంలో స్టేడియానికి కరెంట్ తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, విద్యుత్ బకాయిల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో అధికారులు ఉప్పల్ స్టేడియానికి కరెంట్ సరఫరా నిలిపి వేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర దుమారం కావడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉప్పల్ స్టేడియానికి కరెంట్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news