నా బాధ్యత మరింత పెరిగింది.. పవన్‌ కల్యాణ్‌ పోస్టు వైరల్

-

ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేనాని పవన్‌ కల్యాణ్ తాజాగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా ఆయన బాధ్యత స్వీకరించిన అనంతరం ఆ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. తన బాధ్యత మరింత పెరిగిందని క్యాప్షన్ జత చేశారు.

చాలా అరుదుగా పవన్‌ కల్యాణ్‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తన ఇన్‌స్టాలో చాలా తక్కువగా పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆయన పంచుకున్న వీడియో వైరల్‌గా మారింది. ‘ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా ఉంది. ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగింది. రాష్ట్రానికి అంకితభావంతో, చిత్తశుద్ధితో సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను. ప్రతి ఒక్కరికీ సంపన్నమైన, సుస్థిరమైన భవిష్యత్తును అందించాలని ఆసక్తిగా ఉన్నాను’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పవన్‌ షేర్‌ చేసిన వీడియోలో ఆయన మంగళగిరి పార్టీ ఆఫీసు నుంచి బయలుదేరి తన ఛాంబర్‌కు వచ్చి పూజలు నిర్వహించడం చూపించారు.

Read more RELATED
Recommended to you

Latest news