రెండు రాష్ట్రాల సీఎంల సమావేశం..ప్రజా భవన్‌కు చేరుకున్న తెలంగాణ టీమ్

-

2 తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కాబోతున్న సంగతి తెలిసిందే.శనివారం సాయంత్రం ఆరు గంటలకు రెండు రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ కీలక భేటీలో పాల్గొనే తెలంగాణ టీమ్ ప్రజా భవన్‌కు చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు కాసేపటి క్రితం ప్రజా భవన్‌కు చేరుకున్నారు. అధికారులు వీరికి స్వాగతం పలికారు.

మరోవైపు ఈ భేటీలో పాల్గొనే ఆంధ్ర ప్రదేశ్ బృందం మరికాసేపట్లో ప్రజా భవన్‌కు రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ లోని తన నివాసం నుండి బయలు దేరారు. మరికాసేపట్లో ఆయన ప్రజా భవన్‌కు చేరుకోనున్నారు. గత 10 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న విభజన రాష్ట్ర సమస్యల పరిష్కారమే అజెండాగా ఈ భేటీ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news