ఓటీటీలోకి విజయ్‌ సేతుపతి యాక్షన్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

తమిళ స్టార్ నటుడు విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో నిథిలన్‌ స్వామి నాథన్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా చిత్రం ‘మహారాజ’. ఇటీవల విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జులై 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇదీ మహారాజ స్టోరీ : మ‌హారాజా (విజ‌య్ సేతుప‌తి) ఓ బార్బర్‌. ఒక‌ ప్రమాదంలో భార్యను పోగొట్టుకుంటాడు. అత‌నికంటూ మిగిలిన‌ ఒకే తోడు కూతురు జ్యోతి. త‌ను ఆ బిడ్డతోనే క‌లిసి సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. ఒకరోజు ముగ్గురు అగంత‌కులు త‌న ఇంట్లోకి చొర‌బ‌డి త‌న‌పై దాడి చేశార‌ని.. ఈ క్రమంలోనే త‌మ బిడ్డ ప్రాణాల్ని కాపాడిన ల‌క్ష్మిని ఎత్తుకెళ్లిపోయార‌ని ఎలాగైనా స‌రే ఆ ల‌క్ష్మిని వెతికి పెట్టమ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాడు. మ‌రి మ‌హారాజా చెప్పిన ఆ ల‌క్ష్మి ఎవ‌రు? అతని ఫిర్యాదును స్వీక‌రించ‌డానికి పోలీసులు తొలుత ఎందుకు నిరాకరించారు? అస‌లు మ‌హారాజాపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులెవ‌రు? వాళ్లకు, అత‌నికి ఉన్న విరోధం ఏంటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news