Telangana : రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్లు బదిలీ

-

తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ల బదిలీ జరిగింది. 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్ భగవత్, రాచకొండ పోలీస్ కమిషనర్‌గా సుధీర్ బాబు, హోంగార్డులు, ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతి లక్రా, గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర బదిలీ అయ్యారు. ప్రస్తుతం రైల్వే డీజీగా ఉన్న మహేశ్ భగవత్ను లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా నియమించింది. పోలీస్ ఆర్గనైజేషన్ అండ్ హోంగార్డ్స్ డీజీగా స్వాతి లక్రా బదిలీ అయ్యారు.

రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్‌లు బదిలీలు :

శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేష్ భగవత్

హోంగార్డులు, ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతి లక్రా

గ్రేహౌండ్స్‌ ఏడీజీగా స్టీఫెన్‌ రవీంద్ర

పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా విజయ్ కుమార్

పోలీసు సంక్షేమం, క్రీడల అదనపు డీజీగా విజయ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు

టీజీఎస్పీ బెటాలియన్ల అదనపు డీజీగా సంజయ్ కుమార్ జైన్

రాచకొండ పోలీస్ కమిషనర్‌గా సుధీర్ బాబు

ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్ జోషి

మల్టీజోన్ 1 ఐజీగా ఎస్.చంద్రశేఖర్ రెడ్డి

రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీగా కె.రమేష్ నాయుడు

మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి

వనపర్తి ఎస్పీగా ఆర్.గిరిధర్

హైదరాబాద్ తూర్పు మండలం డీసీపీగా బి.బాలస్వామి

హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీగా జి.చంద్రమోహన్

సీఏఆర్‌హెడ్ క్వాటర్స్ డీసీపీగా రక్షితమూర్తి

Read more RELATED
Recommended to you

Latest news