BREAKING: కాంగ్రెస్లోకి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ !

-

Serilingampally MLA Arikapudi Gandhi joins Congress: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్. అటు ఇప్పటికే కాంగ్రెస్లో చేరారు ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అయితే.. తాజాగా కాంగ్రెస్లోకి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Serilingampally MLA Arikapudi Gandhi joins Congress

రేపు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షంలో చేరనున్నారట అరికపూడి గాంధీ. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన 5గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. లక్ష్మారెడ్డి (ఉప్పల్), సుధీర్ రెడ్డి (ఎల్బీనగర్), మాధవరం కృష్ణారావు (కూకట్పల్లి), వివేకానంద గౌడ్ (కుత్బుల్లాపూర్) కూడా కండువా మార్చుకోబోతున్నట్లు సమాచారం. దీంతో గులాబీ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రభుత్వం కోల్పోవడం ఇటు ఎంపీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోవడం… కారణంగా చాలామంది ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. పొద్దున లేస్తే చాలు… గులాబీ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరినట్లు వార్త వినాల్సి వస్తుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news