సోమవారంకి తెలంగాణ అసెంబ్లీ వాయిదా..!

-

బడ్జెట్ పై తెలంగాణ అసెంబ్లీలో చర్చ ముగిసింది. స్పీకర్ సభను సోమవారంకి వాయిదా వేశారు. అసెంబ్లీలో భట్టి ప్రసంగం ముగిసిన తర్వాత హరీష్ రావ్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మీటర్లు పెడతాం అని మోడీకి లేఖ రాసింది మీరు అని పేర్కొన్నారు. నాకేం తొందర లేదు.. పదవి పోయిందని తొందర మికుంది.. బాధ మికుంది అని సెటైర్స్ వేశారు. అబద్దాల కోసం నీ అనుభవం ఉపయోగించకు.. గతంలో చేసిన పాపాలు క్షమాపణ చెప్పు అని పేర్కొన్నారు.

మోటార్ల విషయంలో KCR కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆ విషయంలో బుకాయిస్తున్నారు అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అయితే ఈ రోజు అసెంబ్లీలో బడ్జెట్ విషయంలి వాడి వేడి సంభాషణే జరిగింది అని చెప్పాలి. హరీష్ రావ్ అలాగే భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటకు మాట అనే విధంగా చర్చ నడిచింది అనే చెప్పాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news