హైదరాబాద్‌ లో ఇవాళ ట్రాఫిక్‌ ఆంక్షలు, వైన్స్‌ మూసివేత!

-

తెలంగాణ ప్రజలకు అలర్ట్‌. హైదరాబాద్‌ లో ఇవాళ ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయని…, వైన్స్‌ మూసివేయాలని పోలీసులు అధికారులు ఆదేశించినట్లు సమాచారం. యపాతబస్తీ లాల్ దర్వాజా బోనాలు ఉత్సవాలు ఘనంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇవాళ లాల్ దర్వాజా ఆలయంలో రెండో రోజు రంగం భవిష్యవాణి కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటల తరువాత ప్రారంభం కానుందని అధికారులు ప్రకటించడం జరిగింది.

Traffic restrictions in Hyderabad today, closure of wines

అయితే పాతబస్తీ బోనాల పండుగలో అత్యంత ప్రధాన ఘట్టమైన మాతేశ్వరి ఘటాల సామూహిక ఊరేగింపు ఇవ్వాళ జరగనుందని చెబుతున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం వద్ద అంబారీపై మాతేశ్వరి ఊరేగింపు ప్రారంభం కానుందని పేర్కొన్నారు అధికారులు. ఈ ఊరేగింపు నీ అనుసరించి అన్ని ఆలయాల ఊరేగింపులు సాంస్కృతిక కార్యక్రమాలు, డప్పు, వాయిద్యాలతో నయాపూల్ ఢిల్లీ దర్వాజ వైపు సాగుతాయన్నారు. ప్రధాన ఊరేగింపు సాగే దారి పొడవున పెద్ద ఎత్తున విద్యుత్ దీపాలంకరణ చేపట్టారని… మొత్తం ఊరేగింపు అడుగడుగున పోలీసు బందోబస్తు, నిఘా కెమెరాల నీడలో సాగనుందపి వివరించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news