ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ఉత్తమమైనది..!

-

జగన్ తెచ్చిన భూముల రీ సర్వే వల్ల రైతులకు ఇబ్బందని అది తేసేస్తామమని చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల రీ సర్వే ఆపేసి ఎవరైనా ఇబ్బంది అని చెబితే మాత్రమే సర్వే చేస్తామని చంద్రబాబు అంటున్నారు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. చంద్రబాబు ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. కేంద్రం తెచ్చిన భూముల రీ సర్వేలో భాగంగా మాత్రమే ఏపీలో భూముల రీ సర్వే జరిగింది.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ఉత్తమమైనది. ఇది జగన్ ఆలోచన కాదు కేంద్రంలో ఉన్న నీతి ఆయాగ్ రాష్ట్రాలకి చెబితే వచ్చింది. రానున్న రోజుల్లో ల్యాండ్ టైటీలింగ్ యాక్ట్ ను చంద్ర బాబు కూడా అమలు చేయాల్సి ఉంటుంది. అయితే మరో పేరుతో మరో రూపంలో చంద్ర బాబు తీసుకురాక తప్పదు. అమ్మకు వందనం వచ్చే సంవత్సరం కూడా ఇచ్చే అవకాశం ఉండదని భావిస్తున్నా అని తెలిపారు. ఆలాగే ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళకు 1500 ఇచ్చే పథకం వంటి హామీలను తుంగలో తొక్కుతున్నారు. హామీలు ఇచ్చి మోసం చేసే వ్యక్తి చంద్రబాబు అని రాంబాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news